యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ కత్తి కార్తీకతో పాటు ఆరుగురిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాను ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్న అక్కసుతో కొంత మంది కావాలనే తనపై బురుద జల్లుతున్నారని అన్నారు. 52 ఎకరాల స్థలాన్ని రూ. 35 కోట్లకే ఇప్పిస్తామని చెప్పి… కోటి రూపాయలు అడ్వాన్స్ గా తీసుకుని మోసం చేశారంటూ వారిపై కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. బంజారాహిల్స్కు […]
Category: News
News
15ఏళ్లుగా అత్యాచారం.. నింధితున్ని దారుణంగా పొడిచి చంపిన బాధితురాలు!
ప్రస్తుతం మనిషి ఎంత టెక్నాలజీ పరంగా ముందుకు సాగుతున్నా.. తనలోని పైశాచిక కోరికలు మాత్రం చంపుకోలేకపోతున్నారు. కొంత మంది కామాంధులు ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఆడవారిపై రెచ్చిపోతూ అత్యాచారాలకు పాల్పపడుతున్నారు. చిన్న పిల్లలు అని కూాడా చూడకుండా అత్యాచారాలు చేస్తున్నారు. తాజాగా ఓ మహిళను అశ్లీల వీడియోలు చూపించి తనని గత 15ఏళ్లుగా అత్యాచారం చేస్తున్న నిందితుణ్ని కత్తితో 25సార్లు పొడిచి చంపింది. రాజధాని భోపాల్కు 214 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధ్యప్రదేశ్ గుణాలో గత 15 […]
గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు .. ఆయన జీవిత విశేషాలు
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (74) కన్నుమూశారు. గురువారం రాత్రి నుంచి శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డ ఆయన శుక్రవారం మధ్యాహ్నాం వెంటిలేటర్పైనే తుది శ్వాస విడిచారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో వస్తాడనుకున్న అభిమానులను శోకసంద్రంలో ముంచేసి తిరిగి రాని లోకాలకు బాలు వెళ్లిపోయారు. బాలు మరణించినట్లు ఆయన కుమారుడు చరణ్ మీడియా ముందు ధృవీకరించారు. చెన్నైలోని మౌంట్రోడ్డులోని సత్యం థియేటర్ వద్దకు బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయం తరలించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. […]
బిగ్ బాస్ నుండి అందుకే అతన్ని సాగనంపారు
బిగ్ బాస్ సీజన్ 4 మొదటివారం ఎలిమినేట్ అయ్యారు డైరక్టర్ సూర్య కిరణ్. షోలో వెళ్ళేప్పుడు వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టంట్ గా అనిపించిన ఆయన వారం రోజులకే ఆడియెన్స్ కు బోర్ కొట్టించేశారు. సూర్య కిరణ్ ఎలిమినేట్ అవడానికి గల కారణాలు ఏంటని ఒకసారి విశ్లేషించుకుంటే.. ఎంట్రీ ఇవ్వడమే బ్లాక్ అండ్ వైట్.. తనతో తనకే పోటీ అంటూ భారీ హంగామాతో వచ్చిన సూర్య కిరణ్.. సత్యం, రాజు భాయ్ సినిమాల దర్శకుడిగా కొంతమంది […]
రాజీవ్ కనకాల చెల్లెలు శ్రీలక్ష్మి మరణం…..
రాజీవ్ కనకాల చెల్లెలు శ్రీలక్ష్మి మరణం….. శ్రీ లక్ష్మి కాన్సర్ కారణంగా చనిపోయిందని సమాచారం … వివరాలకు కింద ఉన్న వీడియో లింక్ ఓపెన్ చేసి చుడండి …
మరో మంచి పని కోసం కదిలొచ్చిన మంచు హీరో
మంచి పని అంటే తాగే మంచినీళ్లను కూడా పక్కన పెట్టేసి మరీ ముంచుకొచ్చేంత మంచోడు మన మంచు మనోజ్. దిశా కుటుంబాన్ని పరామర్శించడం గాని, ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు తన వాయిస్ వినిపించడం గాని చేయడంలో కుర్రోడు ముందుంటాడు. ఇప్పుడు మరో సారి అలాంటి పని కోసమే ముందుకొచ్చాడు. కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తుండడంతో, శానిటైజర్లు, మాస్కులు వాడమని అందరూ ప్రచారాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ మనోజ్ మటుకు కేవలం […]
కరోనా నిమిత్తం తరలి వచ్చిన “ఆర్ఆర్ఆర్” హీరోలు
ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా వైరస్ సోకకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఒక్కొక్కరు ఒక్కో రకమైన సలహాతో ముందుకొస్తున్నారు. రాజకీయ నాయకులైతే దీనికి కులం, మతం తో లింక్ పెట్టి కంపు చేశారు, మరి కొందరు బ్లీచింగ్ పౌడర్, పారాసెటమాల్ అంటూ పెంట చేశారు. ఆ కంపుని, పెంట ని క్లీన్ చేయడానికి ఇప్పుడు రాజమౌళి హీరోలు ముందుకొచ్చారు. కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే మాస్కులు ధరించాలి అనే పోకడని తుడిచేస్తూ నిజంగా దగ్గు, జ్వరం లాంటివి […]
ట్వీట్లతో వాతలు పెట్టిన అసలైన ఇస్మార్ట్ శంకర్ : గిది సినిమారా భాయ్
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టి మంచి ఊపు మీదున్నాడు హీరో రామ్. 6 రోజులకే 56 కోట్ల రూపాయలకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఇస్మార్ట్ శంకర్ ఇప్పటికే అన్ని సెంటర్లలో లాభాల బాట పట్టాడు. అయితే ఇస్మార్ట్ శంకర్ లోని కొన్ని సన్నివేశాలపై వస్తున్న విమర్శలపై హీరో రామ్ తనదైన శైలిలో అదిరిపోయే ట్వీట్ వేసి విమర్శకుల నోర్లు మూయించాడు.”హీరో హెల్మెట్ పెట్టుకోలేదు హీరో స్మోక్ చేస్తున్నాడు హీరో అమ్మాయిలకు […]
షాకింగ్ న్యూస్ : టాలీవుడ్ యువ నటుడు మృతి..!
టాలీవుడ్ వరుస విషాదాలు కలచి వేస్తున్నాయి. ఈమధ్యనే దర్శక నిర్మాత నటి విజయనిర్మల మరణం ఇండస్ట్రీని షాక్ అయ్యేలా చేసింది. అది మరవకముందే మరో ప్రముఖ నటుడి మృతి అందరికి షాక్ ఇస్తుంది. సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో వచ్చిన సమ్మోహనం సినిమాలో నటించిన అమిత్ పురోహిత్ మృతి చెందారు. సినిమాలో హీరోయిన్ అదితిరావు హైదరి ఎక్స్ బోయ్ ఫ్రెండ్ గా నటించాడు అమిత్ పురోహిత్. అమిత్ మరణ వార్త తనని తీవ్రంగా […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన ప్రకటన.. ప్రతి ఒక్కడు చప్పట్లు కొట్టాల్సిందే
ఆంధ్ర ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి తనదైన శైలిలో పరిపాలన కొనసాగిస్తున్నారు. ఒక నిర్ణయమైతే శత్రువులు కూడా చప్పట్లు కొట్టేవిధంగా తీసుకుంటున్నట్లు తెలిసింది. ప్రతీ ఒక్కరికి ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కల .. అటువంటి కల ని ప్రభుత్వ ఋణ సదుపాయంతో నిజం చేసుకునేలా ప్రభుత్వం సాయం చేస్తుంది. కానీ ఆ సాయం పొందాలంటే ఇక నుండి ఋణ గ్రహీతలు తప్పనిసరిగా ఒక పని చేయవలసి ఉంది. అది ఏంటో తెలియాలంటే […]